అయిజ మండలంలో లారీ కింద పడుకొని రైతు ఆందోళన

అయిజ మండలంలో లారీ కింద పడుకొని రైతు ఆందోళన

అయిజ, వెలుగు: వారం రోజుల కింద కాంటా వేసిన వడ్లను మిల్లుకు తరలించకుండా తిప్పలు పెడుతున్నారని ఓ రైతు లారీ కింద పడుకొని ఆందోళనకు దిగాడు. మండలంలోని బైనపల్లి కొనుగోలు కేంద్రం పరిధిలోని పులికల్  గ్రామానికి చెందిన జమ్మన్నకు చెందిన70 బస్తాల వడ్లను వారం రోజుల కింద కాంటా వేశారు. వడ్లు మిల్లుకు తరలించకుండా అతడి ఇంటి వద్దనే ఉంచారు.

అకాల వర్షాలతో వడ్లు తడుస్తున్నాయని పలుమార్లు సెంటర్  నిర్వాహకులకు చెప్పినా, వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో సోమవారం అదే గ్రామానికి చెందిన మరో రైతు వడ్లు తరలించేందుకు లారీ రావడంతో, విషయం తెలుసుకున్న జమ్మన్న లారీ కింద పడుకొని తన వడ్ల బస్తాలు కూడా తరలించాలని ఆందోళనకు దిగాడు. సెంటర్  నిర్వాహకులు, తోటి రైతులు నచ్చజెప్పడంతో శాంతించాడు.